రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. DSP కి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. పిటిషన్‌లో ఏం పేర్కొందంటే?

by Anjali |
రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్.. DSP కి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. పిటిషన్‌లో ఏం పేర్కొందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య లవ్ ఎఫైర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవల ప్రేయసి లావణ్య రాజ్‌ తరుణ్‌‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైట్ చేయడంతో హీరో వ్యవహారం గురించి నెట్టింట క్షణాల్లో వైరల్ అయింది. ‘‘నా ప్రపంచం.. రాజ్‌ నాకు కావాలి. రాజ్‌తరుణ్‌ నేను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటించి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకొని నన్ను దూరం పెట్టాడు. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి నాకు దూరంగానే ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నాను. ఆ సమయంలో రాజ్‌ తరుణ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు. నాకు పోలీసులే న్యాయం చేయాలి’’ అంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదులో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ కంప్లైంట్ పై హీరో రాజ్ తరుణ్ స్పందించి.. లావణ్య చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఖండించాడు. పోలీసులు నిన్న (జులై 6) లావణ్యకు నోటిసులు పంపించిన విషయం తెలిసిందే. అలాగే రాజ్ తరుణ్‌తో రిలేషన్ లో ఉందంటూ వస్తోన్న వార్తలపై నిన్ని హీరోయిన్ మాల్వీ మాల్హోత్రా స్పందించి ఫుల్ ఫైర్ అయ్యింది. ఈ ఇష్యూలో తన పేరును లాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మాల్వీ మల్హోత్రా పోలీసులను ఆశ్రయించింది. ‘అసలు లావణ్యతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కలవలేదు కూడా. తను పదే పదే నా ఫ్యామిలీ వాళ్లకి ఫోన్ చేసి బెదిరిస్తోంది. నా బ్రదర్ తోని మాట్లాడని, మెసేజ్‌లు చేశానని, అందులో తను బెదిరించాడని లావణ్య నా ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేస్తుంది. సంబంధం లేని కేసులో నన్ను నా సోదరుడ్ని లాగుతుంది. లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని’ మాల్వీ మల్హోత్రా ఉమెన్ సేప్టీ DSP కు కంప్లైంట్ చేసింది.

Advertisement

Next Story