నేడు ఎన్టీఆర్ భవన్‌కు CM చంద్రబాబు.. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం

by Anjali |   ( Updated:2024-07-07 06:03:09.0  )
నేడు ఎన్టీఆర్ భవన్‌కు CM చంద్రబాబు.. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీతో తెలంగాణ టీడీపీ నేతలు స్వాగతం పలకనున్నాను. ఈ క్రమంలో నిరుద్యోగులు.. చంద్రబాబు మీరైనా మా సమస్య గురించి రేవంత్ రెడ్డికి చెప్పండి ప్లీజ్.. అంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేయాలని కోరనున్నారు. చంద్రబాబును కలిసేందుకు 11.30 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు తెలంగాణ గ్రూప్స్, నిరుద్యోగులు. వెళ్లనున్నారు.

ఇక నిన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం గురించి ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు ప్రజాభవన్‌కు చేరుకున్నారు. సీఎం రాకతో కాంగ్రెస్ నేతలు హైదరాబాదులో భారీగా ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. హైదరబాదులో నిన్న ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి ఇతర మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed