పని చేయలేదు..మిమ్మల్ని పోషించలేను వెళ్ళిపోతున్న

by Naveena |
పని చేయలేదు..మిమ్మల్ని పోషించలేను వెళ్ళిపోతున్న
X

దిశ ,భిక్కనూరు : పనిచేయలేను...తాగడం మానేయలేను..మిమ్మల్ని పోషించడంనా వల్ల కాదు, అంటూ పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...భిక్కనూరు మండల కేంద్రంలోని కోరే బీరయ్య (50) గత రెండు సంవత్సరాలుగా పని పాట లేకుండా తిరుగుతూ, తాగుడుకు బానిసయ్యాడు. కుటుంబ పోషణ ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు గుల్ల చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులకు బీరయ్యకు గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్థాపానికి గురైన ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలో పోలీసులు భార్య గంగమణి ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed