శ్రీజ మాజీ భర్త చనిపోవడానికి కారణం అదేనా..! అసలు విషయం చెప్పిన శిరీష్ తల్లి..

by Hamsa |
శ్రీజ మాజీ భర్త చనిపోవడానికి కారణం అదేనా..! అసలు విషయం చెప్పిన శిరీష్ తల్లి..
X

దిశ, సినిమా: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమంగా మారడంతో చనిపోయినట్లు పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా లంగ్స్ డ్యామేజ్ కారణంగా చనిపోయారని సమాచారం. దీంతో అతని మరణం పట్ల చాలామంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. అంతా అతనికి లంగ్స్ డ్యామేజ్ అవడం వల్లనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరిష్ తల్లి అతని మరణానికి గల కారణం తెలిపి అందరినీ షాక్‌కు గురి చేసింది. ‘‘ మేలో అతని పుట్టిన రోజును దుబాయ్‌లో జరుపుకుని వచ్చాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో శిరిష్‌ను జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చేర్పించాము.

దాదాపు అక్కడే అడ్మిట్ అయి 30 రోజులుగా చికిత్స తీసుకుంటుండగా.. ఒక రోజు కార్డియాక్ అరెస్ట్ కావడంతో జూన్ 19 మరణించాడు. కానీ కొన్ని మీడియా సంస్థలు వారికి తెలియకపోవడం వల్ల శిరీష్ మరణం గురించి తప్పుగా రాశారు. కానీ అందులో నిజం లేదు. అయితే భరద్వాజ్ చనిపోయాక అంత్యక్రియలకు చిరంజీవి ఫ్యామిలీకి తెలిపాము. కానీ వారు రాలేదు. నాకు నా మనవరాలు నివృత్తిని చూడాలనిపిస్తుంది. కానీ నేను పోయేలోపు వాళ్లు నా మనవరాలిని చూసే అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం శిరిష్ తల్లి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. శ్రీజ, శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవడంతో సంచలనం సృష్టించింది ఈ ఘటన. కానీ ఈ జంట కాపురం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఓ కూతురు పుట్టగానే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. శ్రీజ కల్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. అలాగే శిరీష్ కూడా ఓ డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ సడెన్‌గా మరణించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Next Story

Most Viewed