ఆసుపత్రి నుండి LK అద్వానీ డిశ్చార్జ్.. ఊపీరి పీల్చుకున్న బీజేపీ శ్రేణులు

by Satheesh |
ఆసుపత్రి నుండి LK అద్వానీ డిశ్చార్జ్.. ఊపీరి పీల్చుకున్న బీజేపీ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వైద్యులు అద్వానీకి ట్రీట్‌మెంట్ అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. తమ అభిమాన నేత సురక్షితంగా ఆసుపత్రి నుండి తిరిగి రావడంతో అద్వానీ అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపీరి పీల్చుకున్నారు. గత నెల 26వ తేదీన కూడ అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. బుధవారం మరోసారి అద్వానీ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆయన కోలుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Next Story

Most Viewed