తెలుగు సీఎంల భేటీపై మార్గాని భరత్ సన్సేషనల్ ఆరోపణలు

by srinivas |
తెలుగు సీఎంల భేటీపై మార్గాని భరత్  సన్సేషనల్ ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ట్రాన్స్‌పోర్ట్స్, డ్రగ్స్‌పైనే చంద్రబాబు, రేవంత్ చర్చలు జరిపారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో తెలుగు ముఖ్యమంత్రుల భేటీపై ఆయన స్పందించారు. విభజన సమస్యలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు మాట్లాడింది తక్కువని వ్యాఖ్యానించారు. మిగిలిన విషయాలపైనే ఎక్కువగా చర్చించారని ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిశారా.. వ్యక్తి గత అవసరాల కోసం భేటీ అయ్యారా అని మార్గాని భరత్ ప్రశ్నించారు. మంచి జరగుతుందని తెలుగు ప్రజలందరూ ఆశించారని తెలిపారు. కానీ ఏపీ పోర్టులపై జరిగిన ప్రచారాన్ని కనీసం ఖండించలేదని మార్గాని భరత్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed