సముద్రతీరంలో పోటెత్తిన క్రికెట్‌ ఫ్యాన్స్.. ముంబయిలో టీమ్‌ఇండియా క్రికెటర్ల రోడ్‌ షో

by PRASAD JUKANTI |
సముద్రతీరంలో పోటెత్తిన క్రికెట్‌ ఫ్యాన్స్.. ముంబయిలో టీమ్‌ఇండియా క్రికెటర్ల రోడ్‌ షో
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముంబయిలోని సముద్ర తీరం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. టీ20 ప్రపంచకప్‌ విజేత టీమిండియా విజయ్ పరేడ్‌ను చూడడానికి ఫ్యాన్స్ లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో మెరైన్ డ్రైవ్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టేడియానికి అభిమానులు వేలాదిగా వచ్చారు. ఇప్పటికే గ్యాలరీలన్నీ ప్రజలతో నిండిపోయాయి. మరోవైపు విశ్వవిజేతలు ముంబయికి వస్తున్న వేళ వరుణుడు కరుణించారు. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. కాగా, ముంబయిలో టీమ్‌ఇండియా క్రికెటర్ల రోడ్‌ షో ప్రారంభమైంది. నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్‌ షో జరుగనుంది. ఓపెన్‌ టాప్‌ బస్సులో ముంబయి రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు కొనసాగుతున్నది. వాంఖడే స్టేడియంలో టీమిండియా జట్టు సభ్యులకు బీసీసీఐ సన్మానం చేయనుంది.

Next Story

Most Viewed