- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
సముద్రతీరంలో పోటెత్తిన క్రికెట్ ఫ్యాన్స్.. ముంబయిలో టీమ్ఇండియా క్రికెటర్ల రోడ్ షో
![సముద్రతీరంలో పోటెత్తిన క్రికెట్ ఫ్యాన్స్.. ముంబయిలో టీమ్ఇండియా క్రికెటర్ల రోడ్ షో సముద్రతీరంలో పోటెత్తిన క్రికెట్ ఫ్యాన్స్.. ముంబయిలో టీమ్ఇండియా క్రికెటర్ల రోడ్ షో](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348850-web-image.webp)
దిశ, డైనమిక్ బ్యూరో : ముంబయిలోని సముద్ర తీరం క్రికెట్ అభిమానులతో పోటెత్తింది. టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా విజయ్ పరేడ్ను చూడడానికి ఫ్యాన్స్ లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు అభిమానులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టేడియానికి అభిమానులు వేలాదిగా వచ్చారు. ఇప్పటికే గ్యాలరీలన్నీ ప్రజలతో నిండిపోయాయి. మరోవైపు విశ్వవిజేతలు ముంబయికి వస్తున్న వేళ వరుణుడు కరుణించారు. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తున్నది. కాగా, ముంబయిలో టీమ్ఇండియా క్రికెటర్ల రోడ్ షో ప్రారంభమైంది. నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్ షో జరుగనుంది. ఓపెన్ టాప్ బస్సులో ముంబయి రహదారులపై క్రికెటర్ల ఊరేగింపు కొనసాగుతున్నది. వాంఖడే స్టేడియంలో టీమిండియా జట్టు సభ్యులకు బీసీసీఐ సన్మానం చేయనుంది.