AP:‘ఏం మాట్లాడుతున్నారు జగన్ గారు’..నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
AP:‘ఏం మాట్లాడుతున్నారు జగన్ గారు’..నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా జనసేన నేత కొణిదెల నాగబాబు వైఎస్ జగన్ మాటలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పిన్నెల్లికి కోపమొచ్చి ఈవీఎం పగులగొట్టారన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తాజాగా జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. ‘ఏం మాట్లాడుతున్నారండి బాబు..?’ పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేరా? అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీలో మార్పు రాలేదని అన్నారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారని నాగబాబు అన్నారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈ సారి సింగిల్ డిజిట్ కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని నాగబాబు ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed