ఒడిశా నుంచి తరలిస్తున్న గంజాయి స్వాధీనం

by Aamani |
ఒడిశా నుంచి తరలిస్తున్న గంజాయి స్వాధీనం
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్: ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న సుమారు 27 కేజీల గంజాయిని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు పట్టుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వాహనాల చెకింగ్ లో భాగంగా గురువారం మధ్యాహ్నం ఓఆర్ఆర్ పరిధిలో వాహనాలను చెక్ చేస్తుండగా అనుమానంగా ఉన్నా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓడి 10 ఆర్ 1966 గల ఎర్టిగా కారణం కారును పట్టుకున్నారు. అందులో 36 ప్యాకెట్లలో సుమారు 25 కేజీల గంజాయి హైదరాబాదుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న బలరాం తాళి (23 )రాజు కపస్య (20 )విజయ హాల్దార్ (22 )లతోపాటు కారు యజమాని కొడుకు మైనర్ (13 )సంవత్సరాలుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు ఐదు సెల్ ఫోన్ లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Next Story

Most Viewed