- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రేపటి నుంచి టీ20 సిరీస్ మొదలు.. సిరీస్ విజయంపై భారత మహిళల జట్టు కన్ను
![రేపటి నుంచి టీ20 సిరీస్ మొదలు.. సిరీస్ విజయంపై భారత మహిళల జట్టు కన్ను రేపటి నుంచి టీ20 సిరీస్ మొదలు.. సిరీస్ విజయంపై భారత మహిళల జట్టు కన్ను](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348856-ind-w.webp)
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు జోరు మీద ఉన్నది. సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్లో వన్డే సిరీస్, ఏకైక టెస్టు సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్ కన్ను టీ20 సిరీస్పై పడింది. నేటి నుంచే మూడు టీ20ల సిరీస్ ప్రారంభం. చెన్నయ్ వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్లోనూ హర్మన్ప్రీత్ సేన దూకుడును కొనసాగించాలనుకుంటోంది. తొలి టీ20 నెగ్గి శుభారంభం చేయాలని భావిస్తున్నది.
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఫామ్లో ఉండటంతో జట్టు పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్లతో బౌలింగ్ దళం కూడా బలంగా ఉంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. సౌతాఫ్రికాపై వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆమె రెండు మ్యాచ్ల్లో మూడు వికెట్లతో రాణించింది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్కు ముందు భారత జట్టు ఈ సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది. మరోవైపు, వన్డే సిరీస్, ఏకైక టెస్టుల్లో ఓటమిపాలైన సౌతాఫ్రికా మహిళల జట్టు టీ20 సిరీస్లో సత్తాచాటాలనుకుంటోంది.