టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. సర్కార్ ఉత్తర్వులు జారీ

by srinivas |
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. సర్కార్ ఉత్తర్వులు జారీ
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకమండలి గడువు ముగిసింది. అయితే తిరిగి టీటీడీ చైర్మన్‌గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులలో టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రకటించారు. తాజాగా ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన అనంతరం ఆయన టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed