- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
బంగ్లాదేశ్ లో అల్లరి మూకల విధ్వంసం.. బంగ్లా జాతిపిత విగ్రహంపై మూత్ర విసర్జన
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో నిరసనకారులు, అల్లరి మూకలు మరింత రెచ్చిపోతున్నారు. మంగళవారం రాజధాని ఢాకా నగర వీధుల్లో అల్లరి మూకలు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ జాతపిత, బంగబంధుగా పేరు గాంచిన షేక్ ముజీబీర్ రహమాన్ విగ్రహాలను ఎక్కడిక్కడక ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల ముజీబీర్ రహమాన్ విగ్రహాలపైకి ఎక్కి మూత్రవిసర్జన చేయడం వంటి వికృతాలకు పాల్పడ్డారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా సోమవారం దేశం విడిచి వెళ్ళాక, ఆమె నివాసంలోకి నిరసనకారులు చొరబడి దొరికిన వస్తువులను దొరికినట్టు ఎత్తుకు వెళ్ళగా, మంగళవారం ఆ పార్టీ 'అవామీ లీగ్' నాయకులు, కార్యకర్తలపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ నుండి బంగ్లా విముక్తి పోరాటం చేసిన బంగ్లబంధుగా పిలవబడే షేక్ ముజీబీర్ రహమాన్ విగ్రహాలను ధ్వంసం చేసి, తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల విగ్రహాల మొండెం తొలగిస్తూ.. కొన్నిచోట్ల విగ్రహాల మీదికి ఎక్కి స్లోగన్స్ ఇస్తూ.. మరికొన్ని చోట్ల ముజీబీర్ విగ్రహాలపైకి ఎక్కి మూత్రవిసర్జన చేస్తున్న వీడియోలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా మరికొన్ని చోట్ల ఆ దేశంలోని మైనారిటీలపై కూడా దాడులు చేస్తూ వారిని చంపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.