గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

by Sumithra |   ( Updated:2021-05-25 06:08:04.0  )
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
X

దిశ, చేవెళ్ల: రోడ్డు వెంబడి నడుచుకుంటు వెళుతున్న మహిళను గుర్తుతెలియని కారు ఢీ కొట్టగా మృతి చెందింది. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. షాబాద్ మండలం సంకేపల్లి గూడ గ్రామానికి చెందిన బొగ్గుల బాలమణి (45) షాబాద్ లోని నవజీవన స్కూల్ ఎదురుగుండా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ ను కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మహిళను108 అంబులెన్స్ లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు షాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. తన పిన్ని చావుకు కారణమైన కారును గుర్తించి కారు నడిపిన వ్యక్తి పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారు శివకుమార్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed