ఆ బాలింత అదృష్టవంతురాలే.. క్షణం ఆలస్యమైనా..

by Shyam |
ఆ బాలింత అదృష్టవంతురాలే.. క్షణం ఆలస్యమైనా..
X

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ప్రసూతి వార్డులో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ప్రసూతి మహిళకు కేటాయించిన మంచంపై స్లాబ్ సిమెంట్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. వివరాల్లోకి వెళితే… మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన భార్గవి డెలివరీ కాగా ప్రసూతి వార్డులో బెడ్ పై ఉంచారు. శుక్రవారం అకస్మాత్తుగా వార్డు ప్రాంగణంలో స్లాబ్ సిమెంట్ పెచ్చులు ఊడి భార్గవి మంచంపై పడ్డాయి. ప్రమాద సమయంలో భార్గవి, మంచం పై కూర్చుని ఉండగా… తలభాగంలో స్లాబ్ పెచ్చులు ఊడి పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలిసిన ఆస్పత్రి సిబ్బంది హుటా హుటిన మంచం మీద నుంచి స్లాబ్ పెచ్చులు తొలగించారు.

ప్రభుత్వ పాలనకు నిదర్శనం

ఏరియా ఆస్పత్రి ప్రసూతి వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి బాలింత బెడ్ పై పడ్డ ఘటనను డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రవి నాయక్, ఎండీఅంజద్ లు తీవ్రంగా ఖండించారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రుల్లో ప్రమాదం జరగడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి స్లాబ్ మరమ్మతులు చేపట్టి, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed