ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకులు మృతి

by Sumithra |
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకులు మృతి
X

దిశ, బాల్కొండ: చెరువులో మునిగి బావ, బావమరిది మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామానికి చెందిన భోగజీ తరుణ్(16), పడకంటి శ్రవణ్(24) లు సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామంలోని చెరువులోకి కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు తరుణ్ కాలు జారీ చెరువులో పడడంతో అతనిని కాపాడడానికి వెళ్లిన శ్రవణ్ కూడా నీటిలో మునిగి ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో వారిని బయటకు తీశారు. పోలీసులు మృతులను బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Next Story

Most Viewed