- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు దుర్మరణం
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లాల్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీఎంఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు కలకడ మండల కేంద్రం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్కు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story