క‌ల్కి అవతారుడైన శ్రీ‌ మలయప్ప

by srinivas |
క‌ల్కి అవతారుడైన శ్రీ‌ మలయప్ప
X

దిశ, ఏపీ బ్యూరో : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆ దేవదేవుడు కల్కి అవతారుడై భక్తులకు కనువిందు చేశారు. శ‌ని‌వారం రాత్రి శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.

అశ్వ వాహనంపై మలయప్ప స్వామి

స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెబుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

సర్వభూపాల వాహనంపై

ఆదివారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో స్నప‌న‌తిరుమంజ‌నం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 9 గంట‌ల మ‌ధ్య ధ్వజారోహణం జరుగుతుంది. వాహ‌న‌సేవ‌లో టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖ‌ర్ రెడ్డి, శివ‌కుమార్‌, డీపీ అనంత‌, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, ఆల‌య డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story