బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

by GSrikanth |
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా.. మోడీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి పెద్దపీట వేశారు. ధరణి స్థానంలో మీ భూమి యాప్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వరి క్వింటాలుకు రూ.3100 మద్దరు ధర, నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ప్రతీ ఐదేళ్లకోసారి ఉద్యోగులకు పీఆర్సీ, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి 10 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

10 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో :

1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి

2. వెనుకబడిన వర్గాల సాధికారిత.. అందరికీ సమాన చట్టం వర్తింపు

3. కూడు, గూడు, ఆహార, నివాస భద్రత

4. రైతే రాజు.. అన్నదాతకు అందలం

5. నారీ శక్తి.. మహిళల నేతృత్వంలో అభివృద్ధి

6. యువశక్తి.. ఉపాధి

7. విద్యశ్రీ.. నాణ్యమైన విద్య

8. వైద్యశ్రీ.. నాణ్యమైన వైద్య సంరక్షణ

9. సంపూర్ణ వికాసం.. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు

10. వారసత్వం, సంస్కృతి & చరిత్ర

పూర్తి మేనిఫెస్టో కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేయడి : https://epaper.dishadaily.com/3789916/ICC-Cricket-World-Cup-2023-schedule/BJP#page/1/౧

Advertisement

Next Story

Most Viewed