- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
'మీరు వారికంటే సన్నాసులు కాదా?'.. మంత్రి కేటీఆర్పై వైఎస్ షర్మిల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలు తెలివిలేనోళ్లయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న బీఆర్ఎస్ ది అతి తెలివి కాదా అని మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల గురువారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలే అయితే 2014 లో ఆరుగురిని కొన్న బీఆర్ఎస్ నేతలు పెద్ద దద్దమ్మలు కారా అని, వారు చేతకాని సన్నాసులే అయితే 2018లో 12 మందిని కొన్నందుకు పెద్ద సన్నాసులు కారా అని షర్మిల మండిపడ్డారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలేచిన కుంభకర్ణుడు సీఎం కేసీఆర్ అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మళ్ళీ కేసీఆర్ ను ప్రజలు ఎందుకు ఆశీర్వదించాలో చిన్న దొర ఒక్క కారణం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంమత్రి కేసీఆర్ 9 వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న హంతకుడని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశాఉ. పోడు పట్టాల నుంచి మొదలు దళితబంధు వరకు మోసాలకు తెగబడ్డ గజ దొంగ అని ఆమె విమర్శలు చేశారు. చేతకాని దద్దమ్మలంతా బందిపోట్ల రాష్ట్ర సమితిలోనే ఉన్నారన్నది జగమెరిగిన సత్యంమని, ఇలాంటి చేతకాని దద్దమ్మలను, సన్నాసులను తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.