తెల్లవారితే ప్రభుత్వ ప్రోగ్రాం.. సభా వేదికను ఢీకొన్న యువకుడికి తీవ్రగాయాలు

by Gantepaka Srikanth |
తెల్లవారితే ప్రభుత్వ ప్రోగ్రాం.. సభా వేదికను ఢీకొన్న యువకుడికి తీవ్రగాయాలు
X

దిశ, అడ్డగూడూరు: పనికి వచ్చి మూసీ పునరుజ్జీవన సభావేదికను ఢీకొని యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా అడ్డగూడూడు మండలం మానాయికుంటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మానాయికుంట బ్రిడ్జి మీద ఆదివారం మూసీ(Musi) పునరుజ్జీవన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రాత్రి సమయంలో సభా ప్రాంగణంలో ఎలాంటి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రమాదవశాత్తు సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందిన చరణ్ (17) సభా వేదికను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story