మద్యం మత్తులో కారుతో యువకులు హల్ చల్..

by Rajesh |
మద్యం మత్తులో కారుతో యువకులు హల్ చల్..
X

దిశ, శేరిలింగంపల్లి : మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొట్టి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు, బాధితులు చితకబాదిన సంఘటన కూకట్‌ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్ 3 సి బీవై 0410 నంబరు గల పోలో కారు ఆదివారం రాత్రి ప్రగతి నగర్‌లో పలు ద్విచక్ర వాహనాలను, రోడ్డుపై నిలిపి ఉంచిన ఓ కారును ఢీకొట్టారు.

కారులోని యువకులు ఢీ కొట్టడమే నిర్లక్ష్యంగా కారును నడుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనదారులు, ఆ పోలో కారును వెంబడించి అల్వీన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ చెరువు వద్ద కారును అడ్డుకొని, ప్రమాదానికి కారణమైన కారును ధ్వసం చేశారు. కారులో ఉన్న ఇద్దరు యువకులను చితకబాదారు. పోలీసులకు సమాచారం అందటంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ ఇద్దరు యువకులు మద్యం మత్తులో యాక్సిడెంట్స్ చేశారని, వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story