యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

by Mahesh |
యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పేద ప్రజలకు సాయం చేస్తూ చేసిన వీడియోల ద్వారా ఆయనకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో అతను ఓ పాన్ ఇండియా సినిమా హీరోగా కూడా నటిస్తున్నారు. కాగా ఈ రోజు ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు అడ్వకేట్ తో సహా వచ్చిన ఓ యువతి.. హర్ష సాయి పై ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన వద్ద రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. అలాగే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా యువతి ఫిర్యాదు చేసింది. కాగా కొన్ని రోజుల క్రితం హర్షసాయి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదు చేయగా.. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Read More...

యూట్యూబర్ హర్ష సాయిపై కేసు.. మోసం చేశాడని యువతి ఫిర్యాదు

Next Story