మహిళపై దాడిచేసిన ఐదుగురిపై కేసు నమోదు

by Sridhar Babu |
మహిళపై దాడిచేసిన ఐదుగురిపై కేసు నమోదు
X

దిశ, కాగజ్ నగర్ : మహిళపై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం కాగజ్ నగర్ పట్టణ సీఐ శంకరయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదర్శనగర్ కు చెందిన రీమాయాదవ్ అనే మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో పురుషోత్తం అనే వ్యక్తి మొబైల్ లో ఉందని తెలిసిన సదరు మహిళ దానిని తొలగించాలని కోరింది. కాగా పురుషోత్తం ఆ వీడియోను డిలీట్ చేస్తానని చెప్పినప్పటికీ నాలుగు రోజుల తర్వాత కూడా డిలీట్ చేయలేదు. దీంతో ఆ మహిళ తన భర్త సంతోష్ తో కలిసి అతని వద్దకు వెళ్లి వీడియోని డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పురుషోత్తం, నాయకపు శివగౌడ్, నవీన్ గౌడ్, భరత్, అవినాష్ కలిసి రీమాయాదవ్, ఆమె భర్త సంతోష్ పై దాడి చేశారు. దాంతో సదరు మహిళ కాగజ్‌నగర్‌ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ రామానుజన్ ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నాయకపు శివగౌడ్ ను మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సదరు మహిళ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన శైలజ అనే మహిళతో పాటు తూడూరు ఈశ్వర్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Next Story

Most Viewed