శభాష్.. సాయిచరణ్! నీ సాహసం యువకులకు స్పూర్తి! బాలుడిని సన్మానించిన సీఎం

by Disha Web Desk 14 |
శభాష్.. సాయిచరణ్! నీ సాహసం యువకులకు స్పూర్తి! బాలుడిని సన్మానించిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు. ఈ బాలుడి సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇవాళ బాలుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కలిశారు. ఈ కమ్రంలోనే ముఖ్యమంత్రి బాలుడిని సన్మానించారు.

కాగా, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ నెల 26న నందిగామలో స్థానిక ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. తన స్నేహితుడి తల్లి అదే కంపెనీలో పనిచేస్తుండడంతో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే సాయిచరణ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ నాలుగో అంతస్తులో చిక్కుకున్న కొందరిని రక్షించాడు. అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ రూ. 5 వేలు రివార్డుగా ఇవ్వగా.. తీసుకోవడానికి బాలుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్నవారంత సాయిచరణ్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు.

Read More...

రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు.. రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ కౌంటర్



Next Story

Most Viewed