- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వరదలో కొట్టుకుపోయిన కారు.. తండ్రీ, కూతురు మిస్సింగ్
by Mahesh |
X
దిశ, మరిపెడ: మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం వద్ద బ్రిడ్జి పై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కారు వరద ప్రవాహంలో కొట్టుకు పోయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు.. కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. పురుషోత్తమాయ గూడెం ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అయితే తమ కారు వాగులోకి కొట్టుకు పోయిందని, మా.. మెడ వరకు నీరు వచ్చిందని తండ్రి కూతురు.. తమ బందువులకు పోన్లు చేసి చేపారు. కానీ కొద్ది సేపటికి వారి ఫోన్లు కూడా కలవక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా కనిపించకుండా పోయిన వారి పేర్లు నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Next Story