Collector : ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

by Kalyani |
Collector : ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి(Collector Mikkilineni Manu Chaudhary) ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలు ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 19 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగ రాజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story