VH: దీనిపై సీబీఐ విచారణ జరగాలి.. తిరుపతి లడ్డూ అంశంపై కాంగ్రెస్ నేత వీహెచ్

by Ramesh Goud |
VH: దీనిపై సీబీఐ విచారణ జరగాలి.. తిరుపతి లడ్డూ అంశంపై కాంగ్రెస్ నేత వీహెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి దగ్గర కూడా అవినీతా?, ఈ వ్యవహారంపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్స్ వాడుతున్నారని ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులో వెల్లడైన విషయం తెలిసిందే. దీనిపై గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో స్పందించిన వీహెచ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే అపచారం తన జీవితంలో చూడలేదని, దేవుడి దగ్గర కూడా అవినీతి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వడ్డీ కాసుల వాడని, తప్పు చేసినా, అపచారం చేసినా ఏ ఒక్కరిని విడచిపెట్టడని హెచ్చరించారు. దేవుడి లడ్డూలో ఏవేవో కలిపినట్లు ల్యాబ్ రిపోర్టులో వెల్లడైందని, దీనిపై టీడీపీ వాళ్లు కావాలనే చేశారని ఆరోపణలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ చేయాలని, కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ ఘటనపై స్పందించి, సీబీఐ విచారణకు ఆదేశించాలని వీహెచ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed