- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గ్రూప్-1 అభ్యర్థుల పై లాఠీ ఛార్జ్.. తీవ్రస్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన రోజు రోజు ఎక్కువ అవుతుంది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠిచార్జ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన గ్రూప్స్ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని, గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని, న్యాయం కోరితే రక్తం కళ్ల చూస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు.. జీవో 29 గొడ్డలిపెట్టు అని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.