Nandigam Suresh : మహిళ హత్య కేసు.. పోలీసుల కస్టడీలోకి మాజీ ఎంపీ

by Mahesh |   ( Updated:2024-10-18 13:30:33.0  )
Nandigam Suresh : మహిళ హత్య కేసు.. పోలీసుల కస్టడీలోకి మాజీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు ఈ నెల 5న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఓ మహిళ హత్య కేసులోను ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు విచారించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించగా... మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు 2 రోజుల పోలీస్‌ కస్టడీకి అంగీకరించింది. దీంతో రేపటి నుంచి రెండ్రోజులపాటు మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. గతంలో ఓ మహిళను హత్య చేసిన కేసులో మాజీ ఎంసీ నందిగం సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed