- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
TGSRTC: హైదరాబాద్-విజయవాడ రూట్లో స్తంభించిన రాకపోకలు.. టీజీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన
X
దిశ, వెబ్డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ప్రధాన రహాదారులు జలమయమయ్యాయి. చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి-65పై వరద నీరు పొంగిపొర్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఈ క్రమంలోనే టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్తే 560కి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దైన బస్సుల్లో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story