ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గింపు

by Rajesh |
ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సిటీ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ బస్ పాస్ ధరను భారీగా తగ్గించింది. రూ.2530 బస్సు పాసు ధరను రూ.1900కే అందించనుంది. తగ్గిన ధరతో ప్రయాణికులకు రూ.630 భారం తగ్గినట్లు అవుతుంది. ఈ బస్ పాస్‌తో ఈ మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును టీజీఎస్‌ఆర్టీసీ కల్పించనుంది. అయితే ఈ బస్సు పాస్ ఎయిర్ పోర్టు రూట్‌లో నడిచే పుష్పక్ ఏసీ బస్సులో చెల్లదని క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో వీటిని జారీ చేయనున్నారు. మెట్రో ధరల కంటే ఏసీ బస్సుల ధరలు అధికంగా ఉండటంతో ప్రయాణికులు వీటిలో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. టీజీఎస్‌ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed