Khairatabad: భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న ఖైరతాబాద్‌.. ఆకతాయిలపై షీ టీమ్ పంజా

by Mahesh |
Khairatabad: భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న ఖైరతాబాద్‌.. ఆకతాయిలపై షీ టీమ్ పంజా
X

దిశ, వెబ్ డెస్క్: మహానగరంలో వినాయకచవితి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడు అయిన ఖైరతాబాద్(Khairatabad) మహా గణపతిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని అన్ని రూట్లు ప్రస్తుతం ఖైరతాబాద్ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే వేల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్(She teams) మారువేషంలో ఆకతాయిలపై పంజా విసిరారు. ఖైరతాబాద్‌ మహాగణపతి దగ్గర కొంత మంది ఆకతాయిల హల్‌చల్ చేశారు. కొంత మంది అల్లరి చేస్తూ..వికృత చేష్టలు చేశారు. ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న షీ టీమ్స్(She teams).. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై పంజా విసిరారు. మొత్తం వారం రోజుల్లో 285 మందిని అరెస్ట్ చేసినట్లు షీ టీమ్స్(She teams) పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే వినాయకుడి నిమజ్జనం సమయం దగ్గర పడటంతో పెరిగిన రద్దీ భారీగా పెరిగింది. అలాగే రేపు ఆదివారం సెలవు కావడం, సోమవారం భక్తులు ప్రవేశం లేకపోవడంతో రేపు(Sunday) రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా శనివారం దాదాపు 2 లక్షల మంది దర్శించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం దర్శనాలు నిలిపివేసి టస్కర్‌పైకి గణేశుడి విగ్రహాన్ని ఎక్కించే పనులు జరగనున్నాయి.

Advertisement

Next Story