- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Sensational Tweet: అందుకోసమే కేటీఆర్ అమెరికాకు వెళ్లిండు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ట్వీట్
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో వరదలు చాలామందిని నిరాశ్రయులను చేశాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి సైతం కోపం తెప్పించాయి. కష్టకాలంలో ప్రజలకు ఆదుకోవాల్సింది పోయి అమెరికాలో ఎంజాయ చేస్తూ.. సర్కారుపైనే ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలోనే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో ‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో పింక్ పార్టీకి ఉచ్చు బిగుస్తోంది. అధికార అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ లు చేయించి, సొంత మనుషులను కూడా అనుమానించే పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను వదిలిపెట్టేది లేదు కేటీఆర్. అమెరికాలో ఉన్నా.. ఆస్ట్రేలియాలో ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, కేసులో కీలక నిందితుడైన అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే నిజాలు బయటపెడతానంటూ బెదిరించడని పేర్కొన్నారు. అందుకే ఉన్న ఫలంగా కేటీఆర్ అమెరికాకు పయనం అయ్యాడని ఆరోపించారు. కేసులో ఎక్కడా కూడా తమ పేర్లు రాకుండా తప్పించుకునేందుకు కుట్రులు చేస్తున్నారని అన్నారు. గత నెల రోజులుగా ప్రభాకర్ రావు కేటీఆర్ సన్నిహితుల కస్టడీలోనే ఉన్నాడని బాంబు పేల్చారు. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో దొరకొద్దని స్వయంగా కేసీఆర్ వేడుకుంటున్నారని అని తెలిపారు. ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభాకర్ రావుకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని కవ్వంపల్లి సంచలన ఆరోపణలు చేశారు.