రిపోర్ట్ చేసిన నాటి నుంచే జీతాలు

by Maddikunta Saikiran |
రిపోర్ట్ చేసిన నాటి నుంచే జీతాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీచేసేందుకు డీఎస్సీ(DSC) నిర్వహించింది. ఈనెల 9న డీఎస్సీ 2024లో రిక్రూట్ అయిన వారికి ఎల్బీస్టేడియం(LB Stadium) వేదికగా నియామక పత్రాల(Appointment Letters)ను అందజేశారు. మరుసటి రోజు అంటే 10వ తేదీ నుంచి సంబంధిత జిల్లాల్లో డీఈవో(DEO)లకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నియామకపత్రాలు అందుకున్న వారు ఏ రోజు అయితే రిపోర్ట్ చేశారో ఆనాటి నుంచే వారిని ఆన్ డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ. నరసింహారెడ్డి(EV. Narasimha Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. రిపోర్ట్ చేసిన తేదీ నుంచే వారికి వేతనాలు ఇవ్వాలని డీఈవోలకు స్పష్టంచేశారు.

Advertisement

Next Story