పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకం తిరిగి ప్రారంభించాలి: కేటీఆర్

by Anjali |   ( Updated:2024-07-16 06:34:16.0  )
పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకం తిరిగి ప్రారంభించాలి: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ పథకం తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. పలు రాష్ట్రాల్లో ఈ పథాకన్ని విస్తరిస్తున్నారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోలో ఉన్న పథకాన్ని రద్దు చేయడం ఏంటి? అని గొంతెత్తి ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకుని పథకం అమలు చేయాలని కేటీఆర్ కోరారు. ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ ప్రోటోకాల్ అంశంపై కూడా తీవ్రంగా చర్చించనున్నారు. ఈ అంశంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఇక కేసీఆర్ ఆదేశాలతోనే స్పీకర్ ను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్.. గడ్డం ప్రసాద్ ను మీట్ అవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed