మూసీ బాధితులకు అండగా ఉంటాం : ఆదిలాబాద్ ఎమ్మెల్యే

by Aamani |
మూసీ బాధితులకు అండగా ఉంటాం : ఆదిలాబాద్ ఎమ్మెల్యే
X

దిశ,గండిపేట్: మూసీ బాధితులకు బీజేపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉండి పోరాటం చేస్తామని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. బుధవారం గండిపేట్ మండలంలోని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ లోని విగ్నేశ్వర కాలనీ, శివపురి కాలనీ, దత్తాత్రేయ కాలనీ, మారుతి నగర్, కర్వేల్ హోమ్స్, డ్రీమ్ హోమ్స్, కేంద్రీయ విహార్, విశాల్ నగర్, సాయి హర్ష కాలనీ, సాయిరాం నగర్, మధు పార్క్, రిచ్మండ్ విల్లాస్ మూసీ పరివాహక ప్రాంతాల్లో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుగ్యాల ప్రదీప్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి లతో కలిసి మూసి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రకృతిని నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి తోడుగా నిలుస్తామని బీజేపీ నాయకులు బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. మూసీ అభివృద్ధితో ఎవరికి ఉపయోగమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధితుల ఇల్లు కూల్చివేసి మూసీని సుందరీకరిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. బాధితులకు అండగా పోరాటం చేస్తామని, పక్కాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు వై శ్రీధర్ కొమురయ్య, రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్, బీజీఎంసీ అధ్యక్షుడు మహేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మహాలింగం గౌడ్, భీమార్జున రెడ్డి, వేణు రెడ్డి, రవి, రఘు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story