రిటైర్డ్ టీచర్ ని బురిడీ కొట్టించిన దొంగ బాబాలు..

by Kalyani |
రిటైర్డ్ టీచర్ ని బురిడీ కొట్టించిన దొంగ బాబాలు..
X

దిశ, యాచారం: ప్రభుత్వ ఉద్యోగికి మాయమాటలు చెప్పి బంగారు ఉంగరంతో దొంగ బాబాలు పరారైన ఘటన శనివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శంకర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తక్కల్ల పల్లి, గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేంది మాధవరెడ్డి, నాగార్జునసాగర్ రోడ్ తక్కల్లపల్లి గేటు వద్ద నుండి తమ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా తెలుపు రంగు కారులో సాధువుల అవతారం ధరించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన కవార్నాథ్ మధారి(40), సావ్ నాథ్(32), పర్దేశి నాథ్(25), ప్రేమ్ నాథ్(22,) నలుగురు వ్యక్తులు అతని వద్దకు వచ్చి సేద తీరడానికి చుట్టుపక్కల దేవాలయాలు ఉన్నాయా అని మాటలు కలిపారు. మంత్రించి ఇచ్చిన రుద్రాక్షలు ధరిస్తే తిరుగు ఉండదని మంచి జరుగుతుందని రుద్రాక్ష మాల విభూది ఇచ్చి నమ్మించారు. చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి ఇస్తే పూజలు చేసి ఇస్తామని దాన్ని తీసి ఇవ్వగానే దొంగ బాబాలు అర్ధ తులం బంగారంతో ఉడాయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టగా మాల్ చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన దొంగ బాబాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story