MLA : కాంగ్రెస్ ది చేతల ప్రభుత్వం

by Kalyani |
MLA : కాంగ్రెస్ ది చేతల ప్రభుత్వం
X

దిశ,కేశంపేట: తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, తమ దృష్టి అంతా అభివృద్ధి, సంక్షేమం పై నేనని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపుతామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోధునంపల్లి గ్రామంలో పాఠశాల ప్రహరీ,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లేమామిడి, అల్వాల్, సంగెం గ్రామాలలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తమకు పదవులు ముఖ్యం కాదని గ్రామాల అభివృద్ధియే ముఖ్యమని, గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలన్నారు.అనంతరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యాని హోటల్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నర్సింగ్ రావు, మాజీ జడ్పీటిసి విశాల శ్రవణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ వీరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, గిరియాదవ్,కరుణాకర్ రెడ్డి,రవీందర్ గౌడ్,సురేష్ రెడ్డి,రాంరెడ్డి, అనుమగళ్ల రమేష్,రావుల పెంటయ్య,రూప్లా నాయక్, తైద పర్వతాలు, కోడూరురాములు,శశివర్ధన్ రెడ్డి,దిద్దెల లక్ష్మయ్య, పిప్పళ్ల శేఖర్, సుందరయ్య, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed