బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

by Rajesh |
బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కాగా, బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని.. అగ్రెసివ్‌గా, దేశం పట్ల ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందరిని కలుపుకునే పోయే వ్యక్తికే స్టేట్ చీఫ్ చాన్స్ ఇవ్వాలన్నారు. మరోవైపు స్టేట్ చీఫ్ రేసులో మొదటి నుంచి వినిపిస్తున్న ఈటల శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఏ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలన్నా.. కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు వస్తేనే సాధ్యమన్నారు. కాగా బీజేపీ స్టేట్ చీఫ్ రేసులో ప్రధానంగా ఈటల, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా అధిష్టానం ఎవరికీ ఛాన్స్ ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story