హ్యాంగ్ ఓవర్‌లో రాహుల్ గాంధీ.. దేశ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు: MP లక్ష్మణ్

by Mahesh |
హ్యాంగ్ ఓవర్‌లో రాహుల్ గాంధీ.. దేశ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు: MP లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ ఉన్నారని, ఆయన దాని నుంచి ఇంకా బయటపడలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలో దేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. మోడీ పై కోపంతో దేశంపై చులకనగా మాట్లాడటం సరికాదని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఓడిపోతే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ మొదటి పర్యటనలో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. భారత్ ను వ్యతిరేకించే శక్తులతో రాహుల్ సమావేశం నిర్వహించడమేంటని లక్ష్మణ్ విమర్శలు చేశారు. సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వారి హక్కుల గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed