- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా: మాజీ MLA పుట్టా మధు ఫైర్
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని ఆరునెలల పాలన రుజువు చేసిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ద లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారని, మంత్రి శ్రీధర్ బాబు అండతో మంథనిలో ఇసుక, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి పర్మిషన్ ఉంటే వంద లారీల్లో మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.
ఓటుకు 2 వేల రూపాయలు ఇచ్చి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన శ్రీధర్ బాబు అదే దందాకు ఇపుడు తెర లేపారని విమర్శించారు. మంథని అభివృద్ధి గురించి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని.. కేవలం తన సంపాదనపైనే మంత్రి దృష్టి సారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తరలింపుపై ఆంక్షలు పెట్టినా అవేవీ మంథనిలో అమలు కావడం లేదని ఫైర్ అయ్యారు. మంథనిలో సహజ వనరుల ధ్వంసాన్ని అరికట్టాలని కోరారు.