- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. పీఈటీలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: పీఈటీ పోస్టుల రిక్రూట్ మెంట్ను త్వరగా పూర్తి చేస్తామని పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్లో తెలంగాణ గురుకుల పీఈటీలు మహేష్కుమార్ గౌడ్ను ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 2017 గురుకుల నోటిఫికేషన్లో పేర్కొన్న 616 పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థులు కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ ఇచ్చి, వారి ప్రభుత్వకాలం పూర్తి అయ్యేంతవరకు కూడా రిజల్ట్ను ప్రకటించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19వ తేదీన రిజల్ట్ను ప్రకటించి మెరిట్ లిస్టును కూడా తయారు చేసిందన్నారు. కానీ మెరిట్లో లేని వారు కొందరు కోర్టుకు వెళ్లారన్నారు. ఆ సమస్యను పరిష్కరించి రిక్రూట్ మెంట్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.