రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత

by Sridhar Babu |
రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత
X

దిశ, షాద్ నగర్ : స్మగ్లింగ్ చేస్తున్న విదేశీ బంగారాన్ని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా వాహనాలను చెక్ చేస్తుండగా దాదాపు 4.7 కిలోల బంగారం పట్టుబడినట్లు తెలిపారు.

దీని విలువ రూ. 3.71 కోట్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారాన్ని హ్యాండ్ బ్రేక్ కింద ఒక కుహారంలో ప్రత్యేకంగా తయారు చేసి దాచరారని, అలాగే స్టీరింగ్ వీల్ కింద నాలుగు పాకెట్లు భద్రపరిచారని తెలిపారు. విదేశీ బంగారాన్ని కోయంబత్తూర్ నుండి హైదరాబాద్ కు అక్రమంగా రవాణా చేస్తున్నారని, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed