వాహనదారులకు 'పెట్రో' షాక్.. మళ్లీ పెరిగిన ధరలు

by Rajesh |
వాహనదారులకు పెట్రో షాక్.. మళ్లీ పెరిగిన ధరలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంగళవారం పెట్రోల్, డీజిల్​ ధరలు భగ్గుమంటున్నాయి. ఇక డీజిల్​ ధర కూడా సెంచరీకి చేరువైంది. లీటర్ పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై 70 పైసలు పెరిగాయి. హైదరాబాద్​లో డీజిల్​ సెంచరీకి దగ్గరగా చేరింది. కేవలం 16 పైసలు పెరిగితే వందకు చేరుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 100. 21, డీజిల్ రూ. 91. 47 పైసలకు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 113. 61, డీజిల్ రూ. 99. 84 పైసలకు చేరింది. ఇక విశాఖలో పెట్రోల్ రూ. 113. 43, డీజిల్ రూ. 99. 47కు ఎగబాకింది. గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు పెట్రో, డీజిల్​ ధరలు పెరిగాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ. 115. 4, డీజిల్ రూ. 99. 25గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 105. 94, డీజిల్ రూ. 96కు పెరిగింది. కోల్ కతాలో పెట్రోల్ రూ. 109. 68, డీజిల్ రూ. 94. 62కు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ. 105. 62, డీజిల్ రూ. 89. 70గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed