- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎమ్మెల్యేలు కడియం, తెల్లంపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పార్టీ మారిన ఆ ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఇద్దరిపై చర్యల తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు. పార్టీ మారిన ఎమెల్యేలపై చర్యలు తీసుకొవాలని స్పీకర్కు పలుమార్లు లేఖ రాసినా స్పందించలేదని ఎమ్మెల్యే వివేకానంద తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
Next Story