విద్యార్థుల పాలిట యమగండం… గతంలో పలువురి ఆత్మహత్యలు

by Kalyani |
విద్యార్థుల పాలిట యమగండం… గతంలో పలువురి ఆత్మహత్యలు
X

దిశ, కోటగిరి: సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర స్కూల్ ను గత సంవత్సరం అప్పటి హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ నేడు అదే పాఠశాలకు ఆనుకొని ఉన్న పెద్ద కుంట విద్యార్థుల పాలిట యమగండం లాగా మారింది. ఆధునిక హంగులతో నిర్మించిన పాఠశాలలో 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థులకు వసతి తో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులు ప్లేగ్రౌండ్ బదులుగా పాఠశాలకు ఆనుకొని సుమారు 20 అడుగుల లోతులో పెద్దకుంట ఉండడంతో వర్షాకాలం కావున పూర్తి నీటితో నిండి అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల తమ పిల్లలకు అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు.

గతంలో ఆత్మహత్యలకు నిలయం...

ఇప్పుడు పాఠశాల ఏర్పాటు చేసిన స్థలంలో గతంలో పెద్దకుంట ఉండడంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు విడిచిన విషయం అందరికి తెలిసిందే. అదే స్థలంలో పాఠశాల నిర్మించడం కోసం అవసరమైనంత స్థలంలో గుంటను పూడ్చి పాఠశాల నిర్మించినప్పటికీ మిగిలిన కుంట పూడ్చకపోవడంతో కుంట మొత్తం నీటితో నిండి విద్యార్థుల పాలిట యమగండంగా దర్శనమిస్తుంది. గతంలో కూడా నియోజకవర్గ స్థాయిలో చిన్నపాటి ఏమరుపాటుతో చిన్నారుల మరణాలు చూస్తున్నప్పటికీ అధికారులలో మాత్రం చలనం రావడం లేదు. సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు ఆనుకోని పెద్ద నీటి కుంట ఉండటం ఇటు అధికారులకు, అటు ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు కుంటను పూడ్చి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

కుంట పూడ్చడం చాలా అవసరం… ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అమృతం శివకుమార్

పాఠశాలకు ఆనుకోని ఉన్న పెద్ద కుంటను పూడ్చడం చాలా అవసరం కుంట పూడిక విషయమై గతంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఫలితంగా కుంటను పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed