నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ పై వీడనున్న ఉత్కంఠ

by Mahesh |
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ పై వీడనున్న ఉత్కంఠ
X

దిశ, నకిరేకల్ టౌన్: నకిరేకల్ పట్టణం మున్సిపల్‌గా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా 2021 లో జరిగిన ఎన్నికల్లో నాటి అధికార బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కార్పోరేటర్లు పార్టీ మారడంతో మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే అవిశ్వాసం నెగ్గిన కాంగ్రెస్ పార్టీలో నకిరేకల్ చైర్మన్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక జరగనున్నట్లు తెలిసింది. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 9వ వార్డుకు చెందిన చెవుగొని రజిత చైర్మన్ పదవికి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed