- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తాం
దిశ, నిజామాబాద్ సిటీ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలన్నీ ఎట్టి పరిస్థితుల్లో తప్పక నెరవేరుస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను కార్యకర్తలకు వివరించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు.
ఇదే సమిష్టి కృషితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పనిచేసే పార్టీని దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, ఇంతవరకు ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా మహిళలకు సంక్షేమ పథకాలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు లాంటి గొప్ప చారిత్రాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే నేను సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తహేర్ బీన్ హందన్, నరాల రత్నాకర్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.