గంజాయి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు

by srinivas |   ( Updated:2024-10-13 17:29:16.0  )
గంజాయి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: గంజాయి తరలింపుపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా కొందరు దుండగులు యధేచ్ఛగా జిల్లాలు దాటించేస్తున్నారు. ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ మూలాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి అంతలా గంజాయి సప్లై జరుగుతోంది. వాహన తనిఖీల్లో పోలీసులకు వందల కేజీల గంజాయి పట్టుబడుతోంది. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇద్దరు యువకులు స్కూటీపై గంజాయి తరలిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగులో గంజాయిని పెట్టుకుని కాలేజీ విద్యార్థుల్లా రోడ్డుపై వెళ్తున్నారు. మారుడుమిల్లి నుంచి విజయవాడకు గంజాయిని తీసుకెళ్తుండగా గోకవరం వద్ద వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్న కారును వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story