సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల అందజేత

by Rajesh |
సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: మామాడి పల్లి సోమవంశీయ సహస్రార్జున క్షత్రియ ఖత్రి సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన యువతులకు బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో కములు కీర్తన (ప్రథమ), సాత్ పుతే రచన (ద్వితీయ), కటారి కవిత (తృతీయ) స్థానాల్లో నిలిచారు. వీరితో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన వారికి సమాజ్ అధ్యక్షులు ఖాందేశ్ సుదర్శన్, కౌన్సిలర్ సంగీత బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సమాజ్ లీగర్ అడ్వయిజర్ జెస్సు అనిల్, సమాజ్ ప్రధాన కార్యదర్శి నందకిషోర్, రాందాస్, కిషన్, ప్రభాకర్, మోహన్, సాత్ పుతే శ్రీనివాస్, అల్జాపూర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story